Monday, May 20, 2024

వేముల ఇంట్లో విషాదం.. కేటీఆర్ సంతాపం

spot_img

రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృవియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి మంజులమ్మ.. హైదరాబాద్‎లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమె భౌతిక కాయాన్ని స్వగ్రామం వేల్పూర్‎కు తరలించారు. రేపు వేల్పూరులో అంత్యక్రియలు జరగనున్నాయని మంత్రి వేముల తెలిపారు.

కాగా, ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు సంతాపం తెలిపారు. వేముల మంజులమ్మ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు కేటీఆర్. వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు కేటీఆర్.

Latest News

More Articles