Friday, May 10, 2024

కేసీఆర్ హుకుమ్.. కేటీఆర్, హరీష్ ల కీలక భేటీ.. సర్వత్రా ఆసక్తి!

spot_img

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు గురువారం నాడు భేటీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రచారం, పెండింగ్ లో ఉన్న అభ్యర్థుల ప్రకటనపై చర్చ జరుగుతున్నట్టు ప్రగతిభవన్ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టేలా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేసీఆర్ స్ట్రాటజీస్ ఎలా ఉండనున్నాయన్నది సర్వత్రా ఆసక్తి నెలకొన్న సమయంలో కేటీఆర్, హరీష్ రావులతో కీలక భేటీ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో హరీష్ రావు, కేటీఆర్ లు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అనారోగ్యానికి గురైన కేసీఆర్ కోలుకున్నారు. పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఎన్నికల సర్వే రిపోర్టులపై చర్చిస్తున్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీ నేతలకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నారు.

Latest News

More Articles