Saturday, May 4, 2024

కుత్బుల్లాపూర్‌కు మెట్రో తీసుకొస్తాం

spot_img

ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా కుత్బుల్లాపూర్‌కు మెట్రోలైన్‌ తీసుకొచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి కేటీఆర్‌. ఐడీపీఎల్‌ చౌరస్తాతో పాటు షాపూర్‌నగర్‌ చౌరస్తాలో జరిగిన రోడ్‌షోలో ఆయన  మాట్లాడారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు సమన్వయంతో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని వేళలా శ్రమిస్తున్నారన్నారు.

ప్రధానంగా ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు మెట్రోమార్గంతో పాటు అవసరమైన చోట్ల ఫైఓవర్లు, విశాలమైన రోడ్లను అభివృద్ధి చేసేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు మంత్రి కేటీఆర్. సూపర్‌ మ్యాక్స్‌ కార్మికులు ఇటీవలే తన దద్గరకు వచ్చి తమ బాధను వ్యక్తం చేశారని.. వారికి శాశ్వత పరిష్కారం చూపేందుకు, అవసరమైన మరో కొత్త కంపెనీని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి.

ఇది కూడా చదవండి:ధరణి పోర్టల్‌ తో అద్భుత ఫలితాలు

Latest News

More Articles