Monday, May 20, 2024

పరిశ్రమ ఎవరు పెట్టినా కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ

spot_img

పరిశ్రమ ఎవరు పెట్టినా కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ మారిందన్నారు మంత్రి కేటీఆర్. రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి..అవి ఎన్నికప్పుడు చేసుకోవచ్చన్నారు. పరిశ్రమలు వచ్చినప్పుడు అందరూ సహకరించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలన్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ(బుధవారం) సంగారెడ్డి జిల్లాలో మోనిన్ పరిశ్రమకి భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్. ఆ తర్వాత మాట్లాడి మంత్రి..తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు సింగిల్ విండో తీసుకువచ్చింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టె పరిశ్రమలకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. స్థానిక యువతకు ఉద్యోగం కల్పించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటు తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభిస్తుంది.

300 కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడితో 40 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమ జీరో పొల్యూషన్ ప్లాంట్ అని అన్నారు మంత్రి కేటీఆర్.18 నెలల్లో ప్లాంట్ నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు మీ ప్రాంతాల్లో పరిశ్రమ వస్తే సహకరించాలన్నారు. కొంతమంది రాజకీయాలు చేస్తారు.. నిజా నిజాలు తెలుసుకోవాలన్నారు మంత్రి. మన మీద నమ్మకం తో పెట్టుబడి పెడుతున్న వారికి అన్ని రకాలుగా సహకరించాలని సూచించారు. ఎవరు పరిశ్రమ పెట్టినా కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ మారిందన్నారు మంత్రి కేటీఆర్. భారతదేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని..తెలంగాణలో 5 రకాల విప్లవాలు ఆవిష్కృతమవుతున్నాయన్నారు మంత్రి కేటీఆర్.

Latest News

More Articles