బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మంత్రి కేటీఆర్
కేటీఆర్ పర్యటన వివరాలు:
👉 ఉదయం 10 గంటలకు వేములవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నంది కమాన్ జంక్షన్ ను ప్రారంభిస్తారు.
👉 ఉదయం 10:30 గంటలకు చింతలతండా గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పాటుచేసిన 42 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారు.
👉ఉదయం 11 గంటలకు జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్, DEIC సెంటర్, మాతృసేవా సెంటర్ ను ప్రారంభిస్తారు.
👉 ఉదయం 11:15 గంటలకు జిల్లా ఆసుపత్రి ఆవరణంలో బయోగ్యాస్ ప్లాంటును ప్రారంభిస్తారు.
👉 ఉదయం 11:30 గంటలకు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం సమీపంలో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు శ్యామకుంట జంక్షన్ వద్ద వెజ్ మార్కెట్ ను ప్రారంభిస్తారు.
👉 మధ్యాహ్నం 12:45 గంటలకు గుడి చెరువు అభివృద్ధి పనులకు, శివార్చన స్టేజికి శంకుస్థాపన చేస్తారు.
👉మధ్యాహ్నం 1 గంటలకు బద్ది పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
👉 మద్యాహ్నం 1:30 గంటలకు భక్తుల సౌకర్యార్థం 100 గదుల కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
👉 మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ బందు పథకంలో భాగంగా 600 మందికి చెక్కులను పంపిణీ చేస్తారు.