Sunday, May 19, 2024

కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాలో రేపు మంత్రి కేటీఆర్ పర్యటన

spot_img

మంత్రి  కేటీఆర్ రేపు(గురువారం) కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కరీంనగర్ జిల్లాలో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్  వినోద్ కుమార్ తో కలిసి వి కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన చేనేత వారోత్సవాల్లో పాల్గొంటారు.

ఆ తర్వాత..రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 గంటల వరకు డిప్యూటీ స్పీకర్  పద్మారావు గౌడ్, మంత్రి  శ్రీనివాస్ గౌడ్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ తో పాటు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు మంత్రి కేటీఆర్. ఆ తర్వాత పద్మనాయక మండపంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల మానేరు కరకట్ట దగ్గర పర్యాటక శాఖ ద్వారా ఏర్పాటు చేసిన నూతన బోటును ప్రారంభిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు సిరిసిల్ల బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన కే కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు జిల్లా ఆసుపత్రిలో 40 కే వి రూప్ టాప్ సోలార్ ప్లాంట్, 130 అదనపు బెడ్స్, డే కేర్ కీమోథెరపీ సెంటర్ ను ప్రారంభిస్తారు మంత్రి కేటీఆర్.

Latest News

More Articles