Monday, May 20, 2024

రైతులారా ఆందోళన వద్దు.. అందుబాటులోకి భారీగా యూరియా

spot_img

రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. రాష్ట్రంలో ఎరువుల నిల్వలపై విడుదల చేసిన మీడియా ప్రకటనలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ‘రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నది. రాష్ట్రంలో 2.18 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. ప్రైవేటు డీలర్ల వద్ద 90 వేల మెట్రిక్ టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 41 వేల మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్ వద్ద 81 వేల మెట్రిక్ టన్నులు, కంపెనీ గోడౌన్లలో 6 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయి.

ఇక ఇప్పటివరకు అందుబాటులో యూరియాతో పాటు మొత్తం 7.57 లక్షల మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు ఉన్నాయి. ఆయా జిల్లాల పంటలసాగు, పంటల పరిస్థితిని బట్టి ఎరువుల నిల్వ ఉంటుంది. రాబోయే నాలుగు రోజులలో అందుబాటులోకి మరో 18 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులోకి రానుంది. రైతులు దుష్ప్రచారాన్ని నమ్మి ఎరువుల కోసం ఆందోళన చెందవద్దు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది’ అని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Latest News

More Articles