Sunday, May 19, 2024

కేసీఆర్ వల్ల దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ

spot_img

అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో 7.35 కోట్లతో నూతనంగా నిర్మించిన గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంబించారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వానికి ములపురుషుడైన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరుతో ఈ కళాశాల ఉండటం సంతోషంగా ఉంది. అదే విధంగా జయశంకర్ గారి విగ్రహం ఈ కళాశాలలో ఏర్పాటు చేయాలని కళాశాల మేనేజ్మెంట్ ను కోరుకుంటున్నాను.

ప్రతి ఏడాది ఈ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు కోటి ఇరవై ఐదు లక్షలు స్కాలర్ షిప్ లు ఇస్తున్నాం. హాస్టల్ ఫుడ్ లో విద్యార్థులకు ప్రతిరోజు గుడ్డు ఇవ్వాలని డీన్ ని సూచించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ గా తెలంగాణ మారింది. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం 5600 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను కేసీఆర్ నియమించారు’ అని అన్నారు మంత్రి పువ్వాడ.

Latest News

More Articles