Saturday, May 18, 2024

మేము ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లం కాదు

spot_img

సీఎం కేసీఆర్‌ వదిలిన బాణం బడే నాగ జ్యోతి అని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్‌. ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ ములుగును జిల్లాగా ఏర్పాటు చేసి.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించారన్నారు. మేము ఢిల్లీ నుంచి రాలేదు ఇక్కడి నుంచి వచ్చిన బిడ్డలమేనని చెప్పారు. నోటుకు, ఓటు కేసులో జైలుకు పోయి నీతులు వల్లించడం రేవంత్ రెడ్డికే చెల్లుతుందన్నారు. గిరిజన సంక్షేమమే కేసీఆర్‌ ధ్యేయమన్నారు మంత్రి సత్యవతి రాథోడ్.

తండాలను, గూడాలను గ్రామపంచాయతీలుగా చేసుకున్నామని తెలిపారు మంత్రి సత్యవతి. 10 శాతం గిరిజన రిజర్వేషన్ పెంచుకున్నాం. పోడు భూములకు పట్టాలు అందించాం. మారుమూల ప్రాంతాల్లో  కూడా బీటీ రోడ్లు వేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏం అభివృద్ధి చేసిందో చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు మంత్రి సత్యవతి రాథోడ్. ములుగు జిల్లా పై గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్‌కు కానుకనిద్దామని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: మైనారిటీ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ పార్టీ కుట్ర

Latest News

More Articles