తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 22న అమరజ్యోతి ఆవిష్కరణతోపాటు అమరవీరుల సంస్మరణ ర్యాలీ ని వైభవోపేతంగా నిర్వహించనున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ చెప్పారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు ఏర్పాట్లపై సాంస్కృతికశాఖతోపాటు ఇతర అధికారులతో శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్ర హం నుంచి సచివాలయం ఎదుట ఉన్న అమరజ్యోతి వేదిక వరకు 5 వేల మందికిపైగా కళాకారులతో ర్యాలీని నిర్వహించనున్నట్టు వెల్లడించారు. కళాకారులు శకటాలపై తమ కళాప్రదర్శనలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.