Sunday, May 19, 2024

సికింద్రాబాద్ బోనాలకు ముహూర్తం ఖరారు..!

spot_img

తెలంగాణలో బోనాల పండుగను అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. బోనాల పండుగలో తొలి పండుగైన సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలను ముహూర్తం ఖరారైంది. జులై 9న సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అనంతరం జులై 10న రంగం (భవిష్య వాణి) నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాంకాళీ ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఘనంగా బోనాల ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల విశిష్టతను ఈ ప్రభుత్వం మరింత పెంచింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాలు, బతుకమ్మ వేడుకలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయి’ అని మంత్రి తలసాని అన్నారు.

Latest News

More Articles