Sunday, May 19, 2024

50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి పనులు.. 10 ఏండ్లలో పూర్తిచేశాం

spot_img

హైదరాబాద్: సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆమీర్ పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అమీర్పేట డివిజన్లోని రేణుక నగర్, బిజెఆర్ నగర్ బల్కంపేట పలు కాలనీలో కాలినడకన  ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేయలని ఓటర్లను అభ్యర్థించారు.గడప గడపలో మంగళ హారతులు పట్టి, నుదుటన తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు మహిళలు.

Also Read.. రేవంత్‌ రెడ్డి తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుంది

ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ.. చరిత్రలో ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి పనులు 10 సంవత్సరాలలో చేసినట్లు తెలిపారు. ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలు ఎప్పటికి మరురవలేనని ఎమోషనల్ అయ్యారు. మీ బిడ్డగా తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు.

Latest News

More Articles