తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి 10న జన్పథ్లో సోనియా గాంధీని కలిశారు. అనంతరం అక్కడి నుంచి పార్లమెంట్కు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేసి.. తన రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. ఈ విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చెప్పారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత ఆయన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.