Saturday, May 18, 2024

బండి సంజయ్ దశాబ్ది ఉత్సవాలను అవమానించారు

spot_img

బాల్కొండ నియోజక వర్గ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘ బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం. పార్టీ కోసం పని చేసిన వారికి కచ్చితంగా సముచిత గౌరవం దక్కుతుంది. కేసిఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ అయ్యింది. కేసిఆర్ సంపద సృష్టిస్తున్నారు..ఆ సంపద నేరుగా లబ్దిదారులు, పేదల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. బండి సంజయ్ కూడా కేసిఆర్ ప్రభుత్వ లబ్దిదారుడే.

తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్ దశాబ్ది ఉత్సవాలను కేసిఆర్ కుటుంబ ఉత్సవాలు అనడం ఆయన అవివేకం. పసుపు బోర్డు పేరుతో రైతులను నిండా ముంచిన బీజేపీని నమ్మే ప్రసక్తే లేదు. కేసిఆర్ గారి సహకారంతో వేల కోట్లతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నాం. నా బాల్కొండ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఏ ఆపదా వచ్చిన నేను తోడుగా నిలబడతా’ అని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Latest News

More Articles