Saturday, May 18, 2024

ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడు మోడీ..!

spot_img

నిజామాబాద్ నందిపెట్ మండలం పలుగుట్టలో ఎమ్మేల్యే జీవన్ రెడ్డి అధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశంలో నరేంద్ర మోడీ ఒక అసమర్థ ప్రధాని. ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడు మోడీ. 5జి స్పెక్ట్రం వేలంలో 15లక్షల కోట్ల కుంభకోణం జరిగింది. ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతి పేరుతో 3లక్షల కోట్ల కుంభ కోణం జరిగింది. మోడీ తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపద దోచి పెడుతున్నాడు.

మోడీ..నిత్యావసర ధరలు పెంచి సామాన్య ప్రజలను గోస పెడుతున్నడు. కేసిఆర్ పాలన గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కు లేదు. కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేవు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసిన అరవింద్ పత్తాలేడు. కేసిఆర్ తోనే జనరంజక పాలన,కేసిఆర్ తోనే అభివృద్ది. ఆర్మూర్ అభివృద్ది మాకు వదిలెయ్యండి..జీవన్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదించండి. ఆర్మూర్ ప్రాంత అభివృద్ధికి నా వంతు సహకారం ఎప్పుడూ అందిస్తా’ అని అన్నారు మంత్రి వెముల ప్రశాంత్ రెడ్డి

Latest News

More Articles