Friday, May 17, 2024

బుల్లెట్ లాంటి ఎమ్మెల్యే రేగా.. గెలవకపోతే పినపాక నష్టపోతోంది

spot_img

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జెరిగింది. ఈ సమావేశానికి హాజరైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావుని గెలిపించాలని పినపాక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న ఈ మీటింగ్ లో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ‘పినపాక నియోజకవర్గంలో బుల్లెట్ లాంటి ఎమ్మెల్యే రేగా ఉన్నాడు. సీఎం కేసిఆర్ దగ్గర కూర్చొని నియోజక వర్గానికి వందల కోట్ల నిధులు తీసుక వచ్చి ఇంచు ఇంచు అభివృద్ధి చేశారు. మణుగూరు మున్సిపాలిటీకి గతంలో నిధులు తీసుక వచ్చిన మగాడు ఎవడు లేడు. 60, 70 రోజులు కష్టపడి ఎమ్మెల్యే ను గెలిపించండి. మిమ్మల్ని 5 సంవత్సారాలు కండ్లకు అద్దుకొని కాపాడతాడు..

ఎమ్మెల్యే రేగ కాంతారావు కరోనా సమయంలో అయన ట్రస్ట్ నుంచి ఎంతోమందికి పేద వారికి సహాయం చేశారు. అదే ప్రతిపక్ష నాయకులు కరొనా సమయంలో కనీసం కాకరకాయ కూడా పంచలేదు. వరదల సమయంలో రేగా కాంతారావు పీకలోతు నీళ్లలో ఉన్న ప్రజల దగ్గర ఉండి పనిచేశారు. రేగ కాంతారావు గెలవకపోతే పినపాక నియోజకవర్గం చాలానష్టం పోతుంది. రేగా ను గెలిపించి సీఎం కేసిఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వండి. కెసిఆర్ మూడో సారి ముఖ్యమంత్రి అవడం ఖాయం. స్వార్థం గా నేను ఒక్కడే గెలవాలి అనుకోలేదు.. మంత్రి పువ్వాడ అజయ్.. నాతో పాటు అందరు ఎమ్మెల్యే లు గెలవాలి అనుకునే వాడిని నేను’ అని అన్నారు మంత్రి పువ్వాడ.

Latest News

More Articles