Sunday, May 19, 2024

స్టేటస్ విషయంలో గొడవ.. మైనర్ బాలుడిని చంపిన మరో మైనర్

spot_img

ఈ మధ్యకాలంలో చాలామందికి ఏం పనిచేసినా, ఎక్కడికి వెళ్లినా స్టేటస్ పెట్టుకోవడం అలవాటుగా మారింది. అలాంటి స్టేటస్ ఓ బాలుడి హత్యకు కారణమైంది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగీలో జరిగింది. అల్కాపూరీ కాలనీలోని మదర్సాలో బీహార్‎కు చెందిన 12 మంది విద్యార్ధులు ఉంటున్నారు. వీరిలో మహ్మద్ రకీమ్, మహమ్మద్ సిరాజ్ అనే బాలలు కూడా ఉన్నారు. అయితే రకీమ్ తన స్నేహితులతో దిగిన ఫోటోను ఫేస్ బుక్ నుంచి తీసుకొని అభ్యంతరకరమైన స్టేటస్‎గా సిరాజ్ పెట్టుకున్నాడు. ఆ స్టేటస్‎కి ఓ హిందీ పాట జోడించి ఇతరులను రెచ్చగొట్టే విధంగా పెట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి, ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో మహ్మద్ రకీమ్ పై మహమ్మద్ సిరాజ్ పిడుగుద్దుల వర్షం కురిపించాడు. ముఖం, తలపై తీవ్ర గాయాలు కావడంతో రకీమ్ అక్కడే కుప్పకూలాడు. గమనించిన నిర్వాహకులు హుటాహుటిన గోల్కొండ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే రకీమ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహ్మద్ సిరాజ్‎ను అదుపులోకి తీసుకున్న నార్సింగీ పోలీసులు.. అతనిపై 304-II సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: అయోధ్యకు సిరిసిల్ల నుంచి బంగారు చీర

Latest News

More Articles