రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు కేశంపేట మండలం చౌలపల్లి ఎంపీటీసీ కోరమోని రాజు, సంతాపూర్ కాంగ్రెస్ నాయకులు ఉప సర్పంచ్ యాలాల యాదయ్య, మాజీ ఎంపీటీసీ బర్కం యాదయ్య, యాలాల నరసింహా, యువకులు తదితరులు. ఈ సందర్భంగా మ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. ‘సంక్షేమ పథకాల అమలులో దేశానికే దిక్సూచిగా తెలంగాణ నిలిచింది అన్నారు.
ప్రతి ఇంటా తెలంగాణ సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి తమ వంతుగా కృషి చేయాలని సూచించారు. తెలంగాణ సర్కార్ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని గడపగడపకు చేరవేయాలన్నారు. సీఎం కేసీఆర్ గారి సారధ్యంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు.