Thursday, May 9, 2024

భార‌త్, పాకిస్థాన్ మ్యాచ్ రేపటికి వాయిదా..!

spot_img

Asia Cup 2023:  ఆసియా క‌ప్‌లో భార‌త్, పాకిస్థాన్ సూప‌ర్ 4 మ్యాచ్ కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. వాన ఎంత‌కూ త‌గ్గ‌క‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేశారు. అయితే, మ్యాచుకు రిజ‌ర్వ్ డే ఉన్నందునా.. 24.1వ ఓవ‌ర్‌ నుంచి య‌థావిధిగా ఇన్నింగ్స్ కొన‌సాగనుంది. రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఇదే స్టేడియంలో 50 ఓవ‌ర్ల ఆట కొన‌సాగ‌నుంది.

Also Read.. రైతులారా ఆందోళన వద్దు.. అందుబాటులోకి భారీగా యూరియా

కొలంబోలోని ప్రేమ‌దాస స్టేడియంలో భార‌త ఇన్నింగ్స్ ధాటిగా సాగుతున్న స‌మ‌యంలో మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. అప్ప‌టికీ భార‌త్ 147/2 (24.1)తో ప‌టిష్ట స్థితిలో ఉంది. విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) నాటౌట్ గా ఉన్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌ 56 ( 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుభ్‌మ‌న్ గిల్ 58 ( 52 బంతుల్లో 10 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు.

పాక్ బౌలర్లను ఉతికారేస్తూ బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డారు భారత ఓపెనర్లు. వీళ్ల ధాటికి భార‌త్ 15 ఓవ‌ర్ల‌లోనే 115 ర‌న్స్ దాటింది. అయితే.. షాదాబ్ ఖాన్ ఓవ‌ర్లో భారీ షాట్ ఆడిన రోహిత్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత షాహీన్ ఆఫ్రీదీ ఓవ‌ర్లో అఘా స‌ల్మాన్ చేతికి క్యాచ్ ఇచ్చి గిల్ వెనుదిరిగాడు. దాంతో, 124 ప‌రుగుల వ‌ద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం కోహ్లీ, రాహుల్ మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఆడారు.

Latest News

More Articles