Asia Cup 2023: ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్ కు వరుణుడు అడ్డుగా నిలిచాడు. వాన ఎంతకూ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేశారు. అయితే, మ్యాచుకు రిజర్వ్ డే ఉన్నందునా.. 24.1వ ఓవర్ నుంచి యథావిధిగా ఇన్నింగ్స్ కొనసాగనుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇదే స్టేడియంలో 50 ఓవర్ల ఆట కొనసాగనుంది.
Also Read.. రైతులారా ఆందోళన వద్దు.. అందుబాటులోకి భారీగా యూరియా
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత ఇన్నింగ్స్ ధాటిగా సాగుతున్న సమయంలో మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అప్పటికీ భారత్ 147/2 (24.1)తో పటిష్ట స్థితిలో ఉంది. విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) నాటౌట్ గా ఉన్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ 56 ( 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు), శుభ్మన్ గిల్ 58 ( 52 బంతుల్లో 10 ఫోర్లు) శుభారంభం ఇచ్చారు.
On to the reserve day 🌧
India will resume their innings tomorrow as persistent rain has put a halt on proceedings 😯#AsiaCup2023 | #INDvPAK | 📝: https://t.co/01BrLxunr3 pic.twitter.com/sDwzdRGtuC
— ICC (@ICC) September 10, 2023
పాక్ బౌలర్లను ఉతికారేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డారు భారత ఓపెనర్లు. వీళ్ల ధాటికి భారత్ 15 ఓవర్లలోనే 115 రన్స్ దాటింది. అయితే.. షాదాబ్ ఖాన్ ఓవర్లో భారీ షాట్ ఆడిన రోహిత్ ఔటయ్యాడు. ఆ తర్వాత షాహీన్ ఆఫ్రీదీ ఓవర్లో అఘా సల్మాన్ చేతికి క్యాచ్ ఇచ్చి గిల్ వెనుదిరిగాడు. దాంతో, 124 పరుగుల వద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం కోహ్లీ, రాహుల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.