Friday, May 17, 2024

తెలంగాణ ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళింది.. లాక్కునే సమయం వచ్చింది

spot_img

సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఏర్పాటును రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు కేటీఆర్. బుధవారం వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గంపై తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. జిల్లాలను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. కొన్నితప్పిదాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. ఇప్పుడు తెలంగాణ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకునే అవకాశం వచ్చిందని కేటీఆర్‌ తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీవి ఆరు గ్యారంటీలు కాదు, 420 అబద్ధాలన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని వారి 420 మ్యానిఫెస్టోతోనే ఎండగట్టాలన్నారు. ఆ పార్టీకి అసలైన సినిమా ముందుందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హామీలను ప్రజలు నేడు నమ్మే పరిస్థితులో లేరని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీఆర్‌ఎస్‌ శ్రేణులు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలువాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో వరంగల్‌ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నేతలంతా హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి బీఆర్‌ఎస్‌ శ్రేణులు చేసిన పలు సూచనలను నమోదు చేసుకున్నారు.

Latest News

More Articles