Saturday, May 18, 2024

అన్ని మండలాల ముఖ్యనేతలు తనవెంటే

spot_img

జనగామ జిల్లా: కొంత మంది తమ నియోజక వర్గ పార్టీ నేతలు హరిత ప్లాజాకు వచ్చారని తెలిసింది. ఎవరు వచ్చారో తెలుసుకుందామని వచ్చానని, వచ్చిన వారిలో ముఖ్య కార్యకర్తలు ఎవరు లేరని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఈసారి జనగామ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కొందరూ హరిత ప్లాజాలో సమావేశమయ్యారు. ఈ విషయం తెలుసుకొని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి హోటల్ వద్దకు వచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి నడిచిన వ్యక్తిని తాను అని పేర్కొన్నారు. నియోజవర్గంలోని అన్ని మండలాల జెడ్పీసీలు, ఎంపీపీలు, మండలాధ్యక్షులు తన వెంటే ఉన్నారని తెలిపారు. గతంలో పల్లా రాజేశ్వర్ రాజేశ్వర్ రెడ్డి తనకు ఫోన్ చేసి ఇలాంటివి ప్రోత్సహించినని చెప్పారని గుర్తుచేశారు. హోటల్ లో నేతల భేటీపై అధిష్టానం చూసుకుంటుందని స్పష్టం చేశారు.

Latest News

More Articles