కరీంనగర్ జిల్లా: ఈనెల 25వ తేదీన బల నిరూపణకు సిద్ధమని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ ని కలిసి ఎక్స్ అఫీషియో మెంబర్ గా సభ్యత్వం ఆర్డర్ కాపీని ఆయన అందుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జమ్మికుంట మున్సిపాలిటిపై మరోసారి విజయకేతనం ఎగరవేస్తామన్నారు. ఈనెల 25వ తేదీన అవిశ్వాస తీర్మానానికి అందరు సభ్యులు హాజరుకావాలని అధికారులు నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.