ఎరుకల సమాజిక వర్గానికి గవర్నర్ అన్యాయం చేశారని మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఉన్న చందన చెరువు కట్టపై ఏకలవ్యుని విగ్రహాన్నిఎమ్మెల్సీ యెగ్గె మల్లేష్, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ఎరుకల సంఘం నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాడు కేసీఆర్ ఎరుకల సామాజిక వర్గం నుంచి సత్యనారాయణను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి గవర్నర్కు పంపిస్తే ఆమె తిరస్కరించారని పేర్కొన్నారు. ఎరుకల సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకాలు వేసింది గవర్నర్ తమిళిసై అని పేర్కొన్నారు. ఆమె కారణంగానే ఆ కులానికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నాంచరమ్మ జాతరకు కేసీఆర్ పది లక్షలు ఇచ్చే వారన్నారు. జాతర్లకు బోనాలకు, అన్ని పండుగలకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించిన అంశాన్ని ఆమె గుర్తు చేశారు. అన్ని కుల సంఘాల వారికి కేసీఆర్ సముచిత స్థానం కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు భూపాల్ రెడ్డి, పోరెడ్డి పద్మ, కామేష్ రెడ్డి, ఎరుకల సంఘం నాయకుడు నాగయ్య, తదితరులు ఉన్నారు.