Friday, May 10, 2024

జూబ్లీహిల్స్ లో భారీ డ్రగ్స్ పట్టివేత..!

spot_img

న్యూ ఇయర్ వేడుకలకు జూబ్లీ హిల్స్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ఇద్దరూ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ లో ప్రముఖ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ ముఠాలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 100 గ్రాముల ఎండీఎంఏ, 29 గ్రాముల బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నూతన సంవత్సరం వేళలో డ్రగ్స్ విక్రయం పై పోలీసుల ఆంక్షలను విధించారు. డ్రగ్స్ ను సేవిస్తే గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలను కూడా తెప్పించారు. డ్రగ్స్ తీసుకున్నారనే అనుమానం వస్తే చాలు అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టనున్నారు. విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు.

 

Latest News

More Articles