Tuesday, May 21, 2024

ఫోన్ పే బంపర్ ఆఫర్..ఫ్రీగా రూ.2వేలు..పూర్తి వివరాలివే.!

spot_img

గతంతో పోల్చితే ఇప్పుడు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యూపీఐ సేవలు అందించే గూగుల్ పే, ఫోన్ పే లాంటి సంస్థలు కస్టమర్ల కోసం పలు ఆఫర్స్ కూడా ప్రకటిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే తాజాగా ఓ బంపర్ ఆఫర్ ను ప్రకటించింది ఫోన్ పే. ఫోన్ పే ద్వారా కేవలం లావాదేవీలే కాదు..పలు ముఖ్యమైన పేమెంట్స్ కూడా చేయోచ్చు.

అంతేకాదు బంగారాన్ని డిజిటల్ రూపంలో కొనే సదుపాయం కూడా కల్పించింది. ఈనేపథ్యంలో అక్షయ త్రుతీయ పండగను పురస్కరించుకుని తాజాగా తన కస్టమర్లకు బంగారంలాంటి ఛాన్స్ ఇచ్చింది ఫోన్ పే. అక్షయ త్రుతీయ 2024 సందర్భగా స్పెషల్ క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ప్రకటించింది. మే 10న ఫోన్ పే ద్వారా 24కే డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు చేస్తే 2వేల వరకు అష్యూర్డ్ క్యాష్ బ్యాక్ పొందవచ్చని తెలిపింది. అయితే దీనికి కొన్ని షరతులు కూడా పెట్టింది.

ఫోన్ పే వినియోగదారులు రూ. 1000గోల్డ్ కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఫోన్ పే తెలిపింది. యూపీఐ, యూపీఐ లైట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, వ్యాలెట్స్ , గిఫ్ట్ కార్డ్ సహా చేసిన పేమెంట్స్ పై క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ పే ద్వారా గోల్డ్ ఎలా కొనుగోలు చేయవచ్చో తెలుసుకుందాం.

ముందుగా ఫోన్ పే ఓపెన్ చేసి రీఛార్జ్ అండ్ పే బిల్స్ అనే విభాగంలోకి వెళ్లాలి. అక్కడ గోడ్ల్ అనే ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని బై వన్ టైమ్ ను సెలక్ట్ చేసుకోవాలి. బై ఇన్ రూపీస్ ను సెలక్ట్ చేసుకుని 24క్యారెట్స్ బంగారాన్ని కొనుగోలు చేయడానికి కనీసం రూ. వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మీ ఆర్డర్ మరోసారి పరిశీలించి ఆపై ప్రొసీడ్ అండ్ పే పై క్లిక్ చేస్తే చాలు.

ఇది కూడా చదవండి: రిజర్వేషన్లు రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు

Latest News

More Articles