Tuesday, May 21, 2024

 రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది

spot_img

పథకాలపేరుతో నమ్మించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు. ఉద్యోగులతో పాటు, రైతులను,మహిళలను దారుణంగా నమ్మించిందన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని.. 5 నెలలవుతున్నా దిక్కులేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం రివర్స్‌ గేర్‌లో నడుస్తోందని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.ప్రచారంతో మాట్లాడిన హరీశ్ రావు… బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యుత్‌ నిరంతరం ఉండేదని, ఇప్పుడు నిత్యం సరఫరా నిలిచిపోతోందన్నారు.

కల్యాణ లక్ష్మి చెక్కు బౌన్స్‌ అయింది.. తులం బంగారం తుస్సుమందన్నారు హరీశ్ రావు. పెండ్లి చేసుకున్న వాళ్లకు తులం బంగారం ఇస్తామన్న హామీ అటకెక్కిందన్నారు. కాంగ్రెస్‌ వచ్చాక బంగారం ధరలు విపరీతంగా పెరిగాయిన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ నిలిచిపోయిందని చెప్పారు. కేసీఆర్‌ ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రియాంక గాంధీ గతంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి హుస్నాబాద్‌కు వచ్చినప్పుడు తాము గెలిస్తే ఇక్కడ మెడికల్‌ కాలేజీ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతుబంధు, ధాన్యానికి రూ.500 బోనస్‌ ఎందుకు రాలేదని ప్రశ్నించారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి:కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

Latest News

More Articles