Tuesday, May 21, 2024

కాంగ్రెస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు

spot_img

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని..ఆ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పాలనకు.. ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని టేకుమట్ల గ్రామంలో నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ప్రజలు తెలుసుకున్నారని అన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భువనగిరి, నల్లగొండ పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయం. ప్రచారంలో వస్తున్న అపూర్వ ప్రజాస్పందనే దీనికి నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం. తమ ఓటమి ఖాయం అయిందని తెలుసుకున్న కాంగ్రెస్ వాళ్లు పోలీసులను ఉపయోగించి బీఆర్ఎస్ శ్రేణులను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరించడం దారుణమన్నారు.

ధాన్యం దిగుబడిలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్న నల్లగొండ జిల్లా.. ఈసారి ఎందుకు వెనుకబడిందో చెప్పాలన్నారు. దీనికి కారకులు ఎవరైనా విషయాన్ని రైతులు గ్రహించారని తెలిపారు. రైతుబంధు పేరుతో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కాలయాపనను రైతులు తెలుసుకున్నారని.. ఎన్నికల్లో రైతుల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. మే 13వ తేదీన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలంతా రెడీ ఉన్నారని స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి.

ఇది కూడా చదవండి: గుండెపోటుతో సచివాలయం ఉద్యోగి మృతి.. వేధింపులే కారణమా?

Latest News

More Articles