Saturday, April 27, 2024

మానవత్వం చాటుకున్న ఎంపీ బీబీ పాటిల్‌

spot_img

ఎదుటువారికి సహాయ పడటంలో ఎప్పుడు ముందుండే జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ (BB Patil) మరోసారి తన మంచితనాన్ని చాటిచెప్పారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి పై డాకుర్(Dakur) గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది.

అదే ఆ మార్గం గుండా వెళ్తున్న ఎంపీ వెంటనే తన వాహనాన్ని పక్కకు రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించారు. గాయపడిన క్షతగాత్రులను వెంటనే అంబులెన్సును పిలిపించి సమీపంలోని దవాఖానకు తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

 

Latest News

More Articles