Monday, May 20, 2024

తెలంగాణలోనే అగ్రగామిగా సత్తుపల్లి

spot_img

సత్తుపల్లి లో ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తుపల్లి అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్,కేటీఆర్ సహకారం తో సత్తుపల్లి ఎంతగానో అభివృద్ది చెందింది. తెలంగాణ రాష్ట్రంలోనే సత్తుపల్లి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రెండుసార్లు చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. ప్రజల కళ్ళ ముందే అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఎక్కువ మెజారిటీ వచ్చేలా మున్సిపాలిటీ ప్రజలు సహకరించాలి. తప్పుడు కేస్ లు పెట్టలేదు.. ప్రజలను వేధించలేదు. అహంకారంతో పని చేయలేదు..ప్రజలతో ఉంటూ పని చేశా. మరో సారి ఓటు వేసి గెలిపించాలి. 15 ఏళ్లుగా చేసిన అభివృద్ధి కొనసాగిస్తా” అని పేర్కొన్నారు.

Latest News

More Articles