Friday, May 10, 2024

బీఆర్ఎస్ లోకి ఉప్పల్ కాంగ్రెస్ క్యాడర్

spot_img

ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి ఆధ్వర్యంలో, మంత్రి హరీశ్ రావు సమక్షంలో ఉప్పల్ సర్కిల్ Ex కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముశనం శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎ కల్పనారెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరారు. మంత్రి హరీశ్ రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ఒకప్పుడు పల్లెలు, పట్టణం అనే తేడా లేకుండా కరెంట్ కోతలు ఉండేవని, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఉండేవని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కరెంట్ కోతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారని అన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతర కరెంట్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా పేరు గాంచిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మా రెడ్డి గెలుపు కోసం అందరూ కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Latest News

More Articles