Saturday, May 18, 2024

కాంగ్రెస్, బీజేపోళ్లు సన్నాసులు,దద్దమ్మలు.. వాళ్ల మాటలు విని మోసపోవద్దు

spot_img

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిరిజనుల కృతజ్ఞతా సభలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పాల్గొని మాట్లాడారు. గ్రామపంచాయతీ గా అభివృద్ధి చెందిన తండాలకు నిధులు మంజూరు చేయిస్తానన్నారు. రాబోయే రోజుల్లో నియోజవర్గం లోని ప్రతి తండాను అభివృద్ధి చేసే బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు.

స్టేషన్ ఘనపూర్ లో బంజారా భవన్ తో పాటు, సేవలాల్ భవన్ కూడా నిర్మిస్తాం. స్టేషన్ ఘనపూర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో, వైద్య ఆరోగ్యంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ కు ఒరగబెట్టింది ఏమీలేదని విమర్శించారు.

తెలంగాణపై కాంగ్రెస్, బిజెపి లు అక్కసు వెళ్లగక్కుతున్నరు. కాంగ్రెస్, బిజెపి సన్నాసుల,దద్దమ్మల  మాటలు విని మోసపోవద్దు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణ లో గులాబీ జెండా ఎగురుతుంది.  బండి సంజయ్ ఉత్తర కుమారునితో సమానం. బిజెపి పార్టీ కేంద్రంలో 9 ఏండ్లుగా అధికారంలో ఉందన్నారు.

తెలంగాణలో గిరిజన యునివర్సిటీ నెలకొల్పలేదు. గిరిజనులకు రిజ్వేషన్లు 6 నుండి 10 వరకు పెంచడానికి ముందుకు రాలేదని మండిపడ్డారు. మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు 10% రిజ్వేషన్ పెంచారు. స్టేషన్ ఘనపూర్ నియోజవర్గంలో తెలంగాణ అమరుడు బొజ్యనాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

Latest News

More Articles