బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తరకుమారుడి వంటివాడని.. ఉత్తమాటలే తప్పా చేసిందేమీ ఉండని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సెటైర్లు వేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి గ్రామంలో గిరిజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కేసీఆర్కు కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, గిరిజనులు పాలాభిషేకం చేశారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా తెలంగాణకు ఏం ఒరగబెట్టావో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. విభజనచట్టంలోని హామీలను నెరవేర్చలేని దద్దమ్మలని, గిరిజన విశ్వవిద్యాలయానికి అనుమతులు వచ్చినా ఇంత వరకు ఏర్పాటు చేయడానికి మనసురావడం లేదన్నారు.