Sunday, May 19, 2024

భార‌త జాగృతి దీక్షకు అనుమ‌తివ్వండి.. డీజీపీకి ఎమ్మెల్సీ క‌విత విజ్ఞ‌ప్తి

spot_img

ఈ నెల 8వ తేదీన త‌ల‌పెట్టిన భార‌త జాగృతి దీక్షకు అనుమ‌తి ఇవ్వాల‌ని డీజీపీ ర‌వి గుప్తాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత విజ్ఞ‌ప్తి చేశారు. ప్రభుత్వ నియామకాల్లో జీవో 3 కారణంగా మహిళలకు రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్సీ క‌విత ఎల్లుండి దీక్ష త‌ల‌పెట్టారు.

ఈ దీక్ష‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని పోలీసుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్ప‌టికీ.. ఇంకా అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలో డీజీపీ ర‌వి గుప్తాతో ఎమ్మెల్సీ క‌విత ఫోన్‌లో మాట్లాడారు. ఇది చాలా ముఖ్య‌మైన దీక్ష అని, దీంతో జీవో 3 వ‌ల్ల జ‌రిగే న‌ష్టాన్ని తెలియ‌జేసే అవ‌స‌రం ఉంద‌న్నారు. శాంతియుతంగానే తాము దీక్ష చేప‌డుతామ‌ని డీజీపీకి తెలిపారు ఎమ్మెల్సీ క‌విత.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు.. తెలంగాణ‌పై గౌర‌వం అంత‌క‌న్నా లేదు

Latest News

More Articles