Friday, May 17, 2024

అప్పుడు ఎట్లున్న తెలంగాణ.. ఇప్పుడు ఎట్లైంది.. ఆసక్తికర వీడియో పోస్ట్ చేసిన ఎమ్మెల్సీ కవిత

spot_img

ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ హిట్ నడుస్తోంది. ఎన్నికల సమరం దగ్గరపడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ నాయకులు నియోజకవర్గాలన్నీ చుట్టేస్తున్నారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఆర్మూర్‌లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టిన దృశ్యాల‌ను ఆమె చిత్రీకరించారు. “ధాన్యపు రాశుల తెలంగాణ. అప్పుడు ఎట్లుంది తెలంగాణ..!! ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ !!” అని కవిత పేర్కొన్నారు.

Latest News

More Articles