Sunday, May 12, 2024

మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్

spot_img

మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.కర్నాటకలో ఐదు గంటలే కరెంట్ ఇస్తున్నామని బాహాటంగా ఒప్పుకున్న ఆ రాష్ట్ర మంత్రి రామలింగ రెడ్డి..కాంగ్రెస్ కు ఓటేస్తే మూడు గంటలే కరెంట్ వస్తుందని చెప్పడానికి సందేహం లేదన్నారు. దీనికి సంబంధించి ఎక్స్ (ట్విట్టర్) లో స్పందించారు ఎమ్మెల్సీ కవిత.

కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 65 ఏళ్ల పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రైతుల ఉసురు తీసుకుందని, ఇప్పుడు మరోసారి మభ్యపెట్టడానికి బయలుదేరిందని తెలిపారు. “కర్నాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నారు. తెలంగాణలో మూడు గంటల పార్టీ కరెంటు చాలని పీసీసీ అధ్యక్షుడు అన్నారు. దీన్నిబట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణలో మూడు గంటల కరెంటే వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు.” అని చెప్పారు.

తెలంగాణలో సీఎం కేసీఆర్ 24 గంటల పాటు రైతంగానికి ఉచిత విద్యుత్తును అందిస్తూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. రైతులపై ఉన్న ప్రేమ, చిత్తశుద్ధితో సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. కాంగ్రెస్ పార్టీకి  మాత్రం రైతుల పట్ల ఎటువంటి మమకారం, చిత్తశుద్ధి లేదని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత.

ఇది కూడా చదవండి: అభివృద్ధికి మారు పేరైన బీఆర్‌ఎస్‌కే మరో అవకాశం ఇవ్వాలి

Latest News

More Articles