Wednesday, May 22, 2024

అయోధ్యలో రాములవారి ప్రతిష్టాపనతో హిందువుల కల నిజం కాబోతోంది

spot_img

అయోధ్య రామమందిరంలో వచ్చే నెల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో రాములవారిని ప్రతిష్టించే గర్భగుడి ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన నేపథ్యంలో.. కవిత ఎక్స్ లో పోస్ట్ చేశారు. ట్రస్ట్ విడుదల చేసిన అయోధ్య రామ మందిరం గర్భగుడికి సంబంధించిన ఫొటోలతో రూపొందించిన వీడియోను పోస్ట్ కు జత చేశారు.

అయోధ్యలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రతిష్టాపనతో కోట్లాది హిందువుల కల నిజం కాబోతున్న శుభసమయంలో తెలంగాణతో పాటు దేశ ప్రజలందరూ స్వాగతించాల్సిన శుభ ఘడియలు అని తెలిపారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న హిందువుల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. రామాలయాన్ని సందర్శించడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత.

Latest News

More Articles