Sunday, May 19, 2024

ద్వేషాన్ని తిర‌స్క‌రించండి.. అభివృద్ధికి ఓటేయండి

spot_img

ఏ రాష్ట్ర ప్రజలైనా ద్వేషాన్ని తిర‌స్క‌రించి.. అభివృద్ధికి ఓటేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. క‌ర్ణాట‌కలో ఈ రోజు అసెంబ్లీ ఎన్నిక‌లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్సీ క‌విత ఓ సూచన చేశారు. క‌ర్ణాట‌క ప్ర‌జ‌లారా..! ఈ ఎన్నిక‌ల్లో ద్వేషాన్ని తిర‌స్క‌రించండి..! అభివృద్ధికి ఓటేయండి అని ఆమె పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల, స‌మాజ శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకొని ఓటేయాల‌ని ఆమె త‌న ట్వీట్‌లో కోరారు.

క‌ర్ణాట‌క‌లోని 224 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఈ రోజు ఒకే విడత‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఈ పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. ఈ ఎన్నిక‌ల్లో 2,615 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. ఇక 5,31,33,054 మంది ఓట‌ర్లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు. మే 13న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు.

Latest News

More Articles