Sunday, May 19, 2024

తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు, రాష్ట్రం తెచ్చిన నాయకుడు కేసీఆర్

spot_img

తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు, రాష్ట్రం తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్.ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కేసులకు భయపడే పరిస్థితి లేదని..బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదన్నారు. ఖమ్మం జిల్లా బీసీ సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్..ప్రతి కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుంది. పార్టీలో అందరికీ సముచిత స్థానం కల్పిస్తాం. రాజ్యసభ సభ్యులు రవిచంద్ర ను జిల్లాలో బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా సీఎం కేసీఆర్ నిలబెట్టారు…అందుకే రాజ్యసభ సీట్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును పార్టీ నిర్ణయించింది. నామ నాగేశ్వరరావు  పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపుకు అందరం కలిసి పని చేయాలి. ఏడవ తేదీన 4 గంటలకు బీఆర్ స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఆ మీటింగ్ ను విజయవంతం చేయటానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు తాతా మధుసూదన్.

ఇది కూడా చదవండి: కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం..పరుగులు తీసిన ప్రయాణికులు

Latest News

More Articles