Tuesday, May 14, 2024

అయోధ్యకు ఎందుకు వెళ్లడం లేదో కారణం చెప్పిన మోహన్ బాబు .!!

spot_img

కోట్లాది మంది ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం రేపు జరగబోతోంది. ఈ కార్యక్రమంలో సామాన్య భక్తుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అయోధ్యకు తరలివెళ్తున్నారు. కొన్నివేల మంది సెలబ్రిటీలు ఈ అద్భుతఘట్టంలో పాలుపంచుకోబోతును్నారు. లక్షల్లో భక్తులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అటు సినీరంగంతోపాటు అన్ని రంగాల నుంచి కార్యక్రమానికి దాదాపుగా 8వేల మంది ప్రముఖలు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి ఆహ్వానం అందించింది.

ఇది కూడా చదవండి : వీకెండ్ రైడ్.. డెడ్ ఎండ్‎ను ఢీకొట్టిన కారు ముగ్గురు మృతి

ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా ఆహ్వానం అందుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అయోధ్య వేడుకకు తనకు ఆహ్వానం అందిందని చెప్పారు. కానీ తాను ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని వెల్లడించారు. భద్రతా కారణాల వల్ల మాత్రమే రాలేకపోతున్నానని తనను క్షమించమని లేఖ రాసినట్లు చెప్పారు. ఇంతటి మహత్తర కార్యక్రమం చేపట్టిన ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యలో కార్యక్రమం జరిగే సమయంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తానని తెలిపారు. ఫిల్మీనగర్ లోని వేంకటేశ్వరస్వామి, శ్రీరాముడు, షిర్డిసాయిబాబా, లక్ష్మీనరసింహస్వామి, సంతోషిమాత ఇలా 18 మంది దేవతలు ఉన్నారు. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని తెలిపారు.

Latest News

More Articles