Sunday, May 12, 2024

ఆలేరు వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు నడపాలి

spot_img

న్యూఢిల్లీ: ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఈరోజు ఢిల్లీలోని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని ఆయన కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నుండి ఆలేరు వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు నడపాలని కోరారు. అదే విధంగా బీబీనగర్- నడికుడి మధ్య డబుల్ లైన్(డబ్లింగ్) పనులు చేపట్టాలన్నారు.

దామచర్ల వయా జాన్ పహాడ్ జగ్గయ్యపేట లైన్లో విద్యుతీకరణ అయి ఉండి ప్రస్తుతం గూడ్స్ రైలు నడుస్తుందని.. ఈ లైన్ లో ప్యాసింజర్ రైలు నడపాలని కోరారు. చిట్యాల-మునుగోడు వెళ్లే రోడ్డులో రైల్వే బ్రిడ్జి ఉందని, దాని స్థానంలో అండర్ పాస్ నిర్మించాలని సూచించారు.

యాదాద్రి-నల్లగొండ జిల్లాలో ఉన్న అన్ని స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని, అలాగే రాష్ట్రంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో మిర్యాలగూడ స్టేషన్ ఒకటని, దీనిని ప్రత్యేకించి ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించాలని రైల్వే మంత్రికి ఆయన వినతి పత్రం అందజేసారు.

Latest News

More Articles