న్యూఢిల్లీ: ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఈరోజు ఢిల్లీలోని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ని ఆయన కార్యాలయంలో కలిసారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నుండి ఆలేరు వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు నడపాలని కోరారు. అదే విధంగా బీబీనగర్- నడికుడి మధ్య డబుల్ లైన్(డబ్లింగ్) పనులు చేపట్టాలన్నారు.
దామచర్ల వయా జాన్ పహాడ్ జగ్గయ్యపేట లైన్లో విద్యుతీకరణ అయి ఉండి ప్రస్తుతం గూడ్స్ రైలు నడుస్తుందని.. ఈ లైన్ లో ప్యాసింజర్ రైలు నడపాలని కోరారు. చిట్యాల-మునుగోడు వెళ్లే రోడ్డులో రైల్వే బ్రిడ్జి ఉందని, దాని స్థానంలో అండర్ పాస్ నిర్మించాలని సూచించారు.
యాదాద్రి-నల్లగొండ జిల్లాలో ఉన్న అన్ని స్టేషన్లో మౌలిక వసతులు కల్పించాలని, అలాగే రాష్ట్రంలో రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో మిర్యాలగూడ స్టేషన్ ఒకటని, దీనిని ప్రత్యేకించి ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించాలని రైల్వే మంత్రికి ఆయన వినతి పత్రం అందజేసారు.