సూర్యాపేట: యాదవుల ఆరాధ్యదైవమైన పెద్దగట్టు లింగమంతుల స్వరూపం మంత్రి జగదీష్ రెడ్డి అని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వం గుర్తించని యాదవులను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి ఎన్నో విధాలుగా వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. వందల కోట్లు ఇచ్చినా ఇవ్వని రాజ్యసభ సభ్యుడి పదవిని ఒక చాయ్ ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో తనకు ఇచ్చారని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: BRS : అనుచిత ఆరోపణలు చేస్తే.. సహించేది లేదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మిషన్ భగీరథ మంచినీరు అందించడమే కాకుండా మూడు లక్షల ఎకరాలకు సాగనీరు అందిస్తున్నామని అన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ని ఓడించాడని, జానారెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలను గెలవనియట్లేదనే కోపంలో మంత్రి జగదీష్ రెడ్డిని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
ఇది కూడా చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 లాంచ్..ధర, ఫీచర్లు ఇవే..!!
బిఆర్ఎస్ లో ఉంటూ పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. రేపు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని మళ్లీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలకు 12 స్థానాలు గెలుస్తామని అన్నారు. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా టిఆర్ఎస్ అండగా ఉంటుందని మాయ మాటలు చెప్పేవాళ్లను నమ్మకుండా మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో యాదవులమంత కలిసికట్టుగా ముందుకు పోదామని పిలుపునిచ్చారు.