Saturday, May 18, 2024

బీసీసీఐని అభినందించిన ఎంపీ సంతోష్

spot_img

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, అతని సహచరులను అభినందించారు. ఇటీవల నిర్వహించిన ఐపీఎల్-2023 యొక్క ప్లేఆఫ్ మ్యాచ్‌లలో వేసిన ప్రతి డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటడానికి బీసీసీఐ చొరవ తీసుకున్నందుకు ఎంపీ సంతోష్ కుమార్ అభినందనలు తెలియజేశారు. ఈ నిర్ణయంలో భాగంగా బీసీసీఐ మొత్తంగా 1,47,000 మొక్కలు నాటింది. అందుకుగాను బీసీసీఐని, ఆటగాళ్లను ఎంపీ సంతోష్ కుమార్ హృదయపూర్వకంగా అభినందించారు.

Latest News

More Articles