భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ ఒక్కటే కాకుండా.. ఫుట్బాల్, టెన్నిస్ అంటే కూడా ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఫుట్బాల్, టెన్నిస్ మ్యాచులు చూడటానికి విదేశాలకు కూడా వెళ్తుంటాడు. తాజాగా ఆయన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో కార్లోస్ అల్కరాజ్ ఆడుతున్న మ్యాచ్ను చూసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మ్యాచ్ అనంతరం అల్కరాజ్ను కలిసిన, మ్యాచ్ చూస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతేడాది కూడా యూఎస్ ఓపెన్ క్వార్టర్ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు భారత క్రికెట్ దిగ్గజం కపిల్దేవ్తో కలిసి వెళ్లాడు.
అయితే.. అదే మ్యాచ్ను టీవీలో చూసిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. మిస్టర్ కూల్ ధోనికి ఓ ఆహ్వానం పంపాడు. తనతో కలిసి గోల్ఫ్ ఆడాలని కోరాడు. దాంతో వీరిద్దరూ సరదగా కాసేపు న్యూజెర్సీలోని బెడ్మినస్టర్లో ఉన్న ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్లో గోల్ఫ్ ఆడారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ధోని వెంట దుబాయికి చెందిన వ్యాపారవేత్త సంఘ్వీ సైతం ఉన్నారు.
MS Dhoni playing golf with Donald Trump.
– The craze for Dhoni is huge. pic.twitter.com/fyxCo3lhAQ
— Johns. (@CricCrazyJohns) September 8, 2023
కాగా.. యూఎస్ ఓపెన్లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్నెం1 కార్లోస్ అల్కరాజ్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 6–3, 6–2, 6–4తో గెలుపొందాడు.