ఐపీఎల్ 2023లో కీలకమైన మ్యాచులో ముంబై ఇండియన్స్ గెలిచి.. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచారు. 8 వికెట్ల తేడాతో హైదరాబాద్ను ఓడించి… 16 పాయింట్లతో నాలుగో స్థానానికి పోటీలోకి వచ్చింది. అయితే, ఈరోజు జరుగుతున్న మరో మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ఫలితంపైనే ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
ముంబై ఇండియన్స్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ 100 నాటౌట్ ( 47 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్లు) మెరుపు సెంచరీతో తన జట్టుకు విజయాన్ని అందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(56) రాణించగా.. చివర్లో సూర్యకుమార్ యాదవ్(25 నాటౌట్) మెరుపులు తోడవ్వడంతో సులువుగా విజయాన్ని సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, నితీశ్ రెడ్డి ఒక్కో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ 83 (46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్లు) వివ్రాంత్ శర్మ 69 (47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. గ్లెన్ ఫిలిఫ్స్(1), హెన్రిచ్ క్లాసెన్ (18), హ్యారీ బ్రూక్(0) నిరాశపరిచారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 4, జోర్డాన్ ఒక వికెట్ తీశారు.
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗖𝗛𝗔𝗦𝗘!@mipaltan stay alive in #TATAIPL 2023 courtesy of an exceptional batting display and an 8-wicket win over #SRH 👏🏻👏🏻#MIvSRH pic.twitter.com/t1qXyVbkqG
— IndianPremierLeague (@IPL) May 21, 2023