హైదరాబాద్: రాష్ట్రంలో మరో మండలం ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలోని రామడుగు గ్రామాన్ని మండలంగా మార్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.
Also Read.. అమ్మాయిలను టచ్ చేస్తే కబడ్దార్.. హైదరాబాద్ పోలీస్ వార్నింగ్
ధర్పల్లి, డిచ్పల్లి మండలాల్లోని ఏడు గ్రామాలను చేరుస్తూ రామడుగు మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రాథమిక నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. వీటిపై అభ్యంతరాలు, వినతులు ఏవైనా ఉంటే 15 రోజులలోపు తెలియజేయాలని నోటిఫికేషన్ లో వెల్లడించారు.