రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్ఐఏ సోదాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. కరీంనగర్లోని హుస్సేనీపురాకు చెందిన తబ్రేజ్ అనే వ్యక్తి ఇంట్లో తెల్లవారుజాము నుంచి సోదాలు జరుగుతున్నాయి. గతంలో ఈ వ్యక్తికి పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయని గుర్తించిన అధికారులు.. రెండు బృందాలుగా ఏర్పడి ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. కాగా.. తబ్రేజ్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఓల్డ్ సిటీకి చెందిన పాపులర్ ఫ్రెండ్ ఆఫ్ ఇండియా నాయకులు అబ్దుల్లా, ఆటో నగర్కు చెందిన మావియా ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా వారిద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ రెస్ట్ హౌస్లో విచారిస్తున్నారు. కాగా.. రెండు రాష్ట్రాలలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టడంతో ఒక్కసారిగా అలజడిరేగింది.