నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా ముగిసింది. పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్న విజయ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీ కొందరి చెప్పుచేతల్లోనే నడుస్తుందని ఆరోపణలు చేశారు. స్థానికేతరులకు ప్రాధాన్యతనిచ్చి స్థానికులనే మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా నాయకుల ముందే పార్టీ కండువాను పడేసి సమావేశంలో నుండి వెళ్లిపోయారు విజయ్ కుమార్ రెడ్డి.