అమెరికా ఆర్థిక చరిత్రకారిణి, ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్ ను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. ఎకనామిక్ సైన్సెస్ లో నోబెల్ ప్రైజ్ కు క్లాడియా గోల్డిన్ ను ఎంపిక చేశారు. ప్రపంచ మహిళల లేబర్ మార్కెట్ ఫలితాలపై అవగాహనను తెలియజేసేలా క్లాడియో పలు సిద్ధాంతాలకు రూపకల్పన చేశారు.
Also Read.. 100 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి పాత రికార్డులను తిరగరాస్తం
1969 నుంచి 2022 వరకు అర్థికశాస్త్రంలో 54 సార్లు నోబెల్ పురస్కారాలు అందజేయగా.. అందులో నోబెల్ ప్రైజ్ కు ఎంపికైన మూడో మహిళగా క్లాడియో గోల్డిన్ నిలిచింది. 2009లో ఎలినార్ ఒస్ట్రోమ్, 2019లో ఎస్తేర్ డఫ్లో నోబెల్ అందుకున్నారు.