Friday, May 3, 2024

వాతావరణశాఖ తీపికబురు..!

spot_img

వాతావరణశాఖ తీపి కబురు చెప్పింది. దేశంలో ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండు రోజుల్లో తెలంగాణపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఇదిలా ఉండగా.. మధ్య బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణశాఖ పేర్కొంది. వాయవ్య దిశగా ప్రయాణిస్తూ.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.

వాయుగుండంగా మారాక ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ బంగ్లాదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయని, తీరం వెంట గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. వాయుగుండం తుఫానుగా మారే అవకాశాలున్నాయని చెప్పింది.

Latest News

More Articles