ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఎక్స్ (ట్విటర్) తమ యూజర్లకు షాక్ ఇచ్చింది. ఎక్స్లో ‘నాట్ ఎ బాట్’ (Not A Bot) అనే కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం.. ట్విట్టర్ కొత్త యూజర్లు పోస్ట్ చేయాలన్నా, వేరొకరి ట్వీట్ను రీ ట్వీట్ చేయాలన్నా, రిప్లే ఇవ్వాలన్నా, లైక్ కొట్టాలన్నా కొంత మేర డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read.. తెలంగాణ ఎన్నికలపై సంచలన సర్వే.. గెలుపు ఎవరిదో తెలుసా ?
మొదటగా న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్లో ఈ కొత్త నిబంధనను ప్రయోగాత్మకంగా టెస్ట్ చేస్తున్నట్లు ఎక్స్ ప్రకటించింది. స్పామ్, ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చినట్లు ట్విట్టర్(ఎక్స్) తెలిపింది. అయితే, సబ్స్క్రిప్షన్ పొందకుండానే కొత్త వినియోగదారులు పోస్ట్లను చదవడం, వీడియోలను వీక్షించడం, ఖాతాలను అనుసరించే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేసింది.